కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డికి హైకోర్టులో ఊరట..

Update: 2019-04-29 10:20 GMT

కాంగ్రెస్‌ సీనియర్ లీడర్‌ కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డికి హైకోర్టులో ఊరట స్వల్ప లభించింది. ఎన్నికల సమయంలో డబ్బు పట్టుబడ్డ కేసులో కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డికి షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. 25వేలు రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలన్న హైకోర్టు 41A సీఆర్పీసీ నోటీసులిస్తే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.

ఇటివల కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్‌కు నాంపల్లి కోర్టు నిరాకరణ తెలిపిన విషయం తెలిసిందే. ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను నిర్బంధించిన కేసులో విశ్వేశ్వర్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోరారు. అయితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొండా సహాయకుడి వద్ద గచ్చిబౌలి పోలీసులు రూ. 10 లక్షలు పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం కేసులో ఎస్‌ఐ కృష్ణ నోటీసులు ఇచ్చేందుకు కొండా కార్యాలయానికి వెళ్లారు. కాగా తనను నిర్బంధించారని తనను అవమానించి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ ఎస్‌ఐ కృష్ణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

Similar News