టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్లో వైఎస్ జగన్తో భేటీ అనంతరం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ పార్టీ కండువా కప్పీ అవంతిని ఆహ్వానించారు. దీంతో స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేశారు అవంతి శ్రీనివాస్. ఇక టీడీపీ సభ్వత్వానికి కూడా రాజీనామా చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు మాట మార్చారని, టీడీపీలో అవినీతి, బంధు ప్రీతి పెరిగిపోయిందని అవంతి శ్రీనివాస్ అన్నారు.