ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయిై వైసీపీ తిరుగులేని అఖండ విజయం సాధించింది. ఏపీలో నారా చంద్రబాబు గారి ఓటమి సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ చంద్రబాబూ..నీ వల్లే తెలంగాణలో టీడీపీ పార్టీ బలైపోయింది. ఆంధ్రాలో పతనమైపోయింది అని అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నీవు ఉన్నంత కాలం పార్టీ బతకదు. ఇక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీని నందమూరి వంశానికి అప్పజెప్పు అని అన్నారు. ఏపీలో ప్రజలందరూ ఎన్నో ఏండ్లుగా నారా చంద్రబాబు గారి అరాచకాలను భరించి చివరకు రాజకీయ సమాధి చేశారన్నారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కున్న బాబుకి రాజకీయ పతనాన్ని కోరుతూ ఎన్టీఆర్ ఆత్మ ఆంధ్రా ప్రజలందర్నీ ఆవహించి బాబును ఓడించి, జగన్ను గెలిపించిందని చెప్పారు.