కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Update: 2019-02-24 07:50 GMT

కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఎక్సైజ్‌, యువజన సర్వీస్‌ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన అత్యధిక ఆదాయం వచ్చే ఎక్సైజ్‌ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఉద్యమనాయకుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.  

Similar News