ఏపీ మంత్రి నారాయణ షాక్... వైసీపీలో చేరిన తోడల్లుడు

Update: 2019-03-27 10:00 GMT

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఇప్పటికే వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరితే టీడీపీ నుంచి కొంతమంది వైసీపీలో చేరిపోతున్నారు. కాగా ఈ రెండు పార్టీలపై అసంతృప్తిగా ఉన్న నేతలు జనసేన గూటికి చేరుతున్నారు. కాగా ఎన్నికలే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరుగా దూసుకపోతున్నారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగిన మంత్రి నారాయణ ప్రచారంలో తనదైన శైలీలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు కాగా నారాయణకు ఆయన సమీప బంధువు రామ్మోహన్ ఊహించని భారీ షాక్ ఇచ్చారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అనిల్ కుమార్‌ల సమక్షంలో వైసీపీలో చేరారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరు నచ్చకనే తాను వైసీపీ గూటకి చేరానని చెప్పారు.

Similar News