ఓట్ల తొలగింపునకు తామే దరఖాస్తులు పెట్టినట్లు వైసీపీ అధినేత జగన్ స్వయంగా అంగీకరించినందువల్ల ఆయనే ఏ -1 ముద్దాయని మంత్రి దేవినేని ఉమ అన్నారు. అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే వైసీపీ కుట్రలు చేస్తోందని ఉమ విజయవాడలో అన్నారు. జగన్ కుతంత్రాలకు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సహకరిస్తున్నాయని చెప్పారు. ఓట్ల తొలగింపునకు పాల్పడిన జగన్పై కేసు నమోదు చేయాలని మంత్రి ఉమ ఎన్నికల సంఘాన్ని కోరారు.