పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత వాయుసేన బాంబుల మోత మోగించిన తర్వాత నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ , విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ , ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు రక్షణ శాఖ ఉన్న తాధికారులు, ఇతర ముఖ్య అధికారులతో తాజా పరిస్థితి గురించి ఆరా తీశారు విమానిక దాడులు జరిగిన తీరు, ఉగ్రవాద స్థావరాల ధ్వంసం, వైమానిక దాడులపై పాకిస్తాన్ స్పందన వంటి విషయాలపై చర్చించారు.