మ్యాన్ అఫ్ ది మ్యాచ్ .. సచిన్ ..

Update: 2019-06-16 06:41 GMT

ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా - పాకిస్తాన్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది .. అయితే ఇందులో హాట్ ఫేవరేట్ గా మాత్రమే ఇండియానే అని చెప్పవచ్చు .. కానీ పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేసి బరిలోకి దిగోద్దని టీం ఇండియా మాజీ క్రికెటర్ గంగూలీ చెబుతున్నారు.. ఒక్కసారి ప్రపంచ కప్ లో ఇరు జట్ల రికార్డ్స్ నెమరు వేసుకుంటే ఇరు జట్లు ఇప్పటివరకు ఆరు సార్లు ప్రపంచ కప్ లో తలబడితే ఇందులో ఆరు సార్లు ఇండియాదే విజయం .. అయితే ఇందులో సచిన్ కి మంచి రికార్డ్ ఉంది .. సచిన్ ఇందులో మూడు సార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు .. మొదటగా 1992 లో 54 పరుగులతో సచిన తొలి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు .. అ తర్వాత 2003 లో 98 పరుగులతో రెండో సారి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.. ఇక 2011 లో 85 పరుగులతో మూడో సారి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు .. పాక్ మ్యాచ్ లలో అత్యధిక సార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడిగా సచిన్ నిలిచాడు.. 

Tags:    

Similar News