ఆటోలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి

Update: 2019-04-20 10:03 GMT

కర్నూలు నగరంలో ప్రమాదం సంభవించింది. ఆటోలో సోడా గ్యాస్ సిలిండర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో పేలిపోయింది. కల్లూరు వక్కెర బ్రిడ్జి వద్ద జరిగిన ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుడిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆక్సిజన్ సిలిండర్లు పేలాయా? లేక ఆటోలో ఏర్పాటు చేసిన సీఎన్‌జీ సిలిండర్ పేలింది తెలియాల్సి ఉంది. ఎండ వేడిమే సిలిండర్ పేలుడుకు గల కారణంగా సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.  

Similar News