సంక్రాంతి సంబురాల్లో అపశృతి..వ్యక్తి మృతి

సంక్రాంతి సంబురాల్లో సంబురంగా మునిగి తెలుతున్న సమయంలో ఓ వ్యక్తి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలుముకున్నాయి.

Update: 2019-01-16 13:41 GMT

సంక్రాంతి సంబురాల్లో సంబురంగా మునిగి తెలుతున్న సమయంలో ఓ వ్యక్తి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలుముకున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే నాగర్‌కర్నూర్ జిల్లాలోని బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఎడ్లబండి ఊరేగింపు నిర్వహించారు గ్రామస్థులు. ఊరేగింపు ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఎడ్ల బండి కింద పడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఎండ్ల బండి ఊరేగింపులో ఉపగంటి జనార్థన్ (32) పోటీలో పాల్గోన్నాడు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఎడ్ల బండి నుండి కిందపడ్డాడు. ఎండ్ల బండి చక్రం వ్యక్తి పై భాగం నుండి వెళ్లడంతో తీవ్రగాయాలతో ఉన్న వ్యక్తి హుటాహుటినా దగ్గల్లో ఉన్న ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు.

Similar News