భారత దేశంలో ఆర్థిక పరమైన నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న కింగ్ ఫిషర్ విజయమాల్యా వరల్డ్ కప్ మ్యాచ్ ల వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడి బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టాడనే ఆరోపణలపై విజయమాల్యా పై ఈడీ, సీబీఐ పలు కేసులు నమోదు చేశాయి. దాంతో మాల్యా దేశం విడిచి పారిపోయి ఇంగ్లాండ్ లో తలదాల్చుకుంటున్నాడు. విజయ్ మాల్యాకు కోర్కెట్ అంటే తగని పిచ్చి. ఇపుడు ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతుండడం.. ఈరోజు భారత్ ఆస్ట్రేలియా మధ్య ముఖ్యమైన మ్యాచ్ ఉండడంతో మ్యాచ్ చూడటానికి విజయ్ మాల్యా ఓవల్ మైదానానికి వచ్చాడు.