సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ప్రారంభమైంది. ఈ సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ను ఇచ్చారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాఘవేంద్రరావు చేతుల మీదుగా స్క్రిప్టును దర్శకుడు అనిల్ రావిపూడి అందుకున్నారు. దర్శకేంద్రుడు ఆశీస్సులతో సినిమాను మొదలుపెట్టేశారు... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ , ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మహేష్ సరసన తొలిసారి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్గా కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. అందుకే టైటిల్ పక్కన గన్, దానిపై ఆర్మీ హెల్మెట్ పెట్టామని వెల్లడించారు. టైటిల్కు దగ్గట్టే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఉంటుందని తెలిపారు.ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు ..