వివాహం వద్దంటూ పీటలపై నుంచి వెళ్లిన వధువు

Update: 2019-02-22 06:42 GMT

పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చక తాళి కట్టే ముందు తనకీ పెళ్లి వద్దంటూ పెళ్లి పీటల పైనుంచి వధువు వెళ్లిపోయిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. మహబూబాబాద్‌కు చెందిన యువకుడికి ఖమ్మంకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరగబోయింది. పంతులు మంత్రాలు చదువుతూ తంతు పూర్తి చేస్తున్నారు. వధూవరులు జీలకర్ర-బెల్లం పెట్టుకున్నారు. కొన్ని క్షణాల్లో వరుడు తాళి కట్టబోతాడనగా పెళ్లి కుమారుణ్ని పక్కకు నెట్టివేసి తనకీ పెళ్లి ఇష్టంలేదంటూ ఆమె వెళ్లిపోయింది. డీఎస్పీ నరేశ్‌కుమార్‌ జోక్యం చేసుకొని వధూవరులతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సయోధ్య కుదరకపోవడంతో పెళ్లి నిలిపివేశారు. 

Similar News