లగడపాటి కోసం బెట్టింగ్ రాయుళ్ళు ఎదురుచూపు ..

Update: 2019-05-26 04:33 GMT

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు గాంచారు లగడపాటి .. అయన సర్వేలు అన్ని ఒకప్పుడు బాగా వర్కౌట్ అయ్యాయి కానీ ఇప్పుడు ఒక్కొకటిగా బెడిసి కొడుతున్నాయి .. తాజాగా ఆంధ్రా ఎన్నికలపై అయన సర్వే విడుదల చేసారు .. మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తుందని ఇది ఫిక్స్ అన్నట్టుగా చెప్పారు .. కానీ అందుకు భిన్నంగా వైసీపీ ప్రభంజనం సృష్టించింది ..

దీనితో లగడపాటి బెట్టింగ్ లపై ఆశలు పెట్టుకొని లక్షల్లో,కోట్లల్లో పందేలు వేసిన బెట్టింగ్ రాయుళ్ళు ఇప్పుడు లగడపాటి కోసం వెతుకుతున్నారట .. ప్రస్తుతం లగడపాటి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేరని కర్ణాటక రాష్ట్రములోని మణిపూర్ లో అయన ఉన్నట్టు అయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి .. గత తెలాంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్పుడు కూడా లగడపాటి మహాకుటమి అధికారంలోకి వస్తునదని చెప్పారు..

దీనితో బెట్టింగ్ రాయుళ్ళు అయన మాటే శాసనం అన్నట్టుగా పందేలు కాసారు.. తీరా ఫలితాలు మాత్రం టీఆర్ఎస్ కి అనుకూలంగా రావడంతో లగడపాటి కోసం బెట్టింగ్ రాయుళ్ళు ఆయన ఇంటి దగ్గర కాపలా కాసారు . అ ఫలితాల తరవాత అయన కనిపించింది లేదు .. మళ్లీ ఆంధ్రా ఎన్నికలు అయిపోయాక కనిపించారు ..

అయితే తాజాగా అయన ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు .. రెండు రాష్ట్రాల్లో తన సర్వే ఫలితాలు చెప్పినట్టు రానందుకు చింతిస్తున్నానని ఇక పై సర్వేలు చేయనని చెప్పారు .. ఇక సోషల్ మీడియాలో కూడా అయనపై వీపరితమైన ట్రోలింగ్ చేస్తున్నారు నేటిజన్స్ ..  

Similar News