అందరి లెక్కలు తేలుస్తాం : మోడీ

Update: 2019-03-28 07:11 GMT

అందరి లెక్కలు తేలుస్తానన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఇవాళ తొలి ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన అన్ని వర్గాలకు గౌరవం దక్కాలన్నదే తమ ధ్యేయమన్నారు. నవ భారత నిర్మాణం మా ధ్యేయమని చెప్పారు. అటువైపు ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిన వారున్నారని, ఇటువైపు నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని చెప్పారు. 70 ఏళ్లుగా సామాన్యులకు బ్యాంకు అకౌంట్లే ఇవ్వని వారు వారి అకౌంట్లలో డబ్బులు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒన్ మ్యాన్ ఒన్ ర్యాంక్ సమస్యను పరిష్కరించామని చెప్పారు మోడీ. 

Similar News