మంచం కింద చిరుత పులి

Update: 2019-02-06 05:36 GMT

తమిళనాడు నీలగిరి జిల్లాలో చిరుత పులి ఓ ఇంట్లోకి చొరబడి గ్రామస్తులను పరుగులు పెట్టించింది. కూడలూరు కైవట్టాలో రైతు రాయిన్‌ తోటలో పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. అలిసిపోయి ఇంట్లోకి వచ్చి మంచంపై పడుకున్న రైతుకు మంచం కింద ఏదో చప్పుడు వినిపించి కిందికి చూడగా చిరుత పులి కనిపించింది. దాంతో రాయిన్‌ అతని భార్య భయంతో బయటకు పరుగులు తీసి ఇంటికి తాళం వేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు చిరుతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో ఆరు గంటలపాటు శ్రమించి చిరుతను బంధించారు.

Full View

Similar News