తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఫలితాలపై విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే వివరాలను వెల్లడించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలాగే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు 14 నుంచి 16 ఎంపీ సీట్లు వస్తాయని..కాంగ్రెస్కు 0 నుంచి 2 ఎంపీ సీట్లు.. బీజేపీకి ఒక ఎంపీ సీటు రావొచ్చని ఇక ఎంఐఎంకు ఒక ఎంపీ సీటు దక్కే అవకాశముందని తెలిపారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే పూర్తి మద్దతును ఇచ్చారని లగడపాటి చెప్పారు.