కర్నూలులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కర్నూలు జిల్లా టీడీపీకి ఎస్వీ మోహన్ రెడ్డి గుడ్బై చెప్పారు. మళ్లీ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎస్వీ మోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పిన జగన్ సాదరంగా ఆహ్వానించారు. జగన్ మోహన్ రెడ్డికి తాను అన్యాయం చేశానని, తప్పు తెలుసుకున్నానని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. అందుకే, మళ్లీ సొంతగూటికి వచ్చానని తెలిపారు. బేషరతుగా వైసీపీలో చేరానని, ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పాటుపడతానని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం వైసీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో భాగంగా కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు.