ఎన్నికలకు ముందే అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్ పేపర్లలో తప్పులున్నాయంటూ బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు, కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సింహాచలం అభ్యంతరం వ్యక్తం చేశారు. అతను ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని 2012 లో అప్పటి హైకోర్టు, 2016 లో సుప్రీంకోర్టు తీర్పు ప్రతులున్నాయని తెలిపారు. కానీ 2013 లో విడుదలైన ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ను అధికారులు ఎలా ఆమోదిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో జనార్ధన్ నామినేషన్ను పరిశీలించిన అధికారులు తిరస్కరించినట్లు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు భారీ షాక్కు గురైయ్యారు.