చంద్రబాబుకు భయమెందుకు: కేటీఆర్‌

Update: 2019-03-04 06:40 GMT

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. డేటా చోరీ కేసు దర్యాప్తు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. కూకట్ పల్లిలో విచారణ కోసం వెళ్లిన ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు , వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే కాగా దీనిపై కేటీఆర్ స్పందించారు. ఏపీ ప్రజల డేటా దొంగతనం చేయకపోతే భయం ఎందుకని ప్రశ్నించారు. ఏం తప్పుచేయని చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అన్న కేటీఆర్ లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతోనే పోలీసులు సోదాలు చేశారని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబు పరపతి తగ్గిపోయిందని, కేసీఆర్‌ను విమర్శిస్తే సానుభూతి వస్తుందని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాట్లాడారు. 

Similar News