టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినప్పుడే తాను విజయం సాధించినట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ నియోజవర్గంలోని ప్రజలెవరూ నిరాశ చెంద వద్దని, తానెప్పుడూ అండగా ఉంటానన్నారు. ప్రతి సమస్య మీద పోరాటం చేస్తానని తెలిపారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనకు కనీసం మీటింగ్కు కూడా పర్మీషన్ ఇవ్వలేదని, అధికార పార్టీ నేతలు మద్యం, డబ్బును విపరీతంగా పంచారని అన్నారు. నైతికంగా విజయం తమే అన్నారు కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. నిన్న వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి 9 సీట్లు సాధించగా కాంగ్రెస్ 3 స్ధానాలు, బీజేపీ 4 ఎంఐఎం1 గా గెలుపొందిన విషయం తెలిసిందే.