చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల సమయంలో చిక్కిన డబ్బుల వ్యవహారంలో నోటీసులు ఇచ్చేందుకు వెళితే పోలీసులను నిర్బంధించారన్న అభియోగంపై విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విశ్వేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.