తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు దిమ్మదిరిగే విధంగా షాక్ ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్లో నియంతృత్వ ధోరణి పెరిగిందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన తనపైనే అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి నన్ను ఓడించారని కోమటిరెడ్డి ఆరోపించారు. అలాంటి కేసీఆర్కు తెలంగాణ ప్రజలు కేవలం 5 మాసాల్లోనే దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారన్నారు. సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్కు తగిన గుణపాఠమే చెప్పారన్నారు.