శివ కుమారస్వామిజీ శివైక్యం

లింగాయత్‌ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా భావించే కర్ణాటక తుముకూరులోని సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి ఇకలేరు. గత కొంతకాలంగా స్వామిజీ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు.

Update: 2019-01-21 09:25 GMT

లింగాయత్‌ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా భావించే కర్ణాటక తుముకూరులోని సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి ఇకలేరు. గత కొంతకాలంగా స్వామిజీ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. స్వామీజీ వయసు 111 ఏళ్లు.

ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో గత ఏడాది డిసెంబరు 8వ తేదీన స్వామీజీకి ఆపరేషన్‌ నిర్వహించారు. ఆ తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడిందని భావించినా హఠాత్తుగా స్వామి ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరమపదించారు. స్వామిజీ మృతి పట్ల కర్ణాటక సీఎం కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడ్యూరప్ప తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. 

Similar News