అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గా కడియం శ్రీహరికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మండలి చైర్మన్ గా కొనసాగుతున్న స్వామిగౌడ్ పదవీ కాలం మార్చి 28తో ముగియనున్నది. అటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రెడ్యా నాయక్ లేదా రేఖానాయక్ లో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని స్వామి గౌడ్ కోరుతున్నారు.