నేడు జనసేనలోకి జేడీ! విశాఖ లోక్‌సభ లేదా భీమిలి నుంచి పోటీ!

Update: 2019-03-17 03:41 GMT

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విజయవాడలోని పార్టీ కార్యాలయం అర్ధరాత్రి ఒంటిగంటకు భేటీ అయ్యారు. ఆయనకు పవన్‌ కల్యాణ్ సాధారంగా స్వాగతం పలికారు. అక్కడ ఇద్దరూ 45 నిమిషాలపాటు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరిక ఖరారైంది. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఆయన పవన్‌ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, విద్యావేత్త, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ రాజగోపాల్ జనసేనలో చేరబోతున్నారు. అయితే, విశాఖ లోక్‌సభ స్థానం లేదా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి లక్ష్మీనారాయణ జనసేన తరఫున బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది.

Similar News