జనసేనలో ఒకే ఒక్కడు ..

Update: 2019-05-24 01:12 GMT
జనసేన ఎట్టకేలకు ఖాతా తెరిచింది . రాష్ట్రంలో వైసీపీ హవా నడుస్తున్న ఎదురొడ్డి నిలిచింది .. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఉత్కంట పోరులో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ రావు విజయం సాధించారు ..  వైసీపీ అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావుపై కేవలం 1167 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి రాజేశ్వరరావుకు 47573 ఓట్లు రాగా.. రాపాకకు 48740 ఓట్లు వచ్చాయి.ఇక టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు 44690 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు..  ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లల్లో ఓడిపోయని సంగతి తెలిసిందే .. 

Similar News