రావెల పార్టీ మార్పుపై జనసేన సైనికుల స్పందన ..

Update: 2019-06-13 02:29 GMT

జనసేన పార్టీకి ఇటివల రావెల కిషోర్ బాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .. అ తర్వాత అయన మోడీ సమక్షంలో బీజేపిలో చేరారు .. అయితే అయన పార్టీ వీడకా పవన్ పై సంచలన వాఖ్యలు చేసారు రావేల.. పవన్ కళ్యాణ్ కనీసం మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ, తన సలహాలు సూచనలు ఎన్నడూ తీసుకోలేదంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రావెల కిషోర్ బాబు పార్టీ మార్పుపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసైనికులు మాట్లాడారు.

టిడిపిలో పలు అవమానాలకు గురవుతున్న రావెల కిషోర్ బాబును పవన్ కళ్యాణ్ ఆదరించి పార్టీలో చేర్చుకుని సోదర స్థానం ఇచ్చినట్లు వారు వివరించారు. పవన్ కళ్యాణ్ అంతగా ఆదరిస్తే చివరకు పార్టీ మారి పవన్ కళ్యాణ్ పైన సంచలన ఆరోపణలు చెయ్యటం ఆయన బుద్ధికి నిదర్శనం అన్నారు. కిషోర్ బాబు పార్టీ మార్పుతో జనసేన కు వచ్చిన నష్టమేమీ లేదని వారన్నారు. 

Tags:    

Similar News