జనసేన మేనిఫెస్టో విడుదల

Update: 2019-04-03 06:15 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధానంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.8,000 అందిస్తామని జనసేన తెలిపింది. 60 ఏళ్లు పైబడిన చిన్న, సన్నకారు, కౌలు రైతులకు రూ. 5 వేలు పెన్షన్ అందిస్తామని వెల్లడించింది. అలాగే 58 ఏళ్ల వయసు పైబడ్డ చేతి వృత్తులవారు, మత్స్యకారులకు రూ.5,000 పెన్షన్ అందిస్తామని పేర్కొంది. రైతుల కోసం గోదావరి బేసిన్ లో అంతర్జాతీయ ధాన్యం-పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మొత్తం 96 హామీలను జనసేన పొందుపరిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే సంకల్పంతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ పేర్కొంది.

పూర్తి మేనిఫెస్టో కోసం క్లిక్‌ చేయండి..


Similar News