నేడు ప‌.గో జిల్లాలో ప‌వ‌న్ ఎన్నికల ప్రచారం

Update: 2019-04-01 03:23 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు సొమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పవన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆచంట గోడవారి రామచంద్రరావు గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో పవన్‌ ప్రసగించనున్నారు. ఉ.10.30 గంటలకు తణుకులో పవన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నిడదవోలులో పవన్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. మ.2.30 గంటలకు తాడేపల్లిగూడెం శేషమహల్‌ సర్కిల్‌, పైవంతెన దిగువన పవన్‌ కల్యాణ్‌ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యకర్తలు, పార్టీశ్రేణులు, అభిమానులు, వీరమహిళలు వేల సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ అభ్యర్థులు కోరారు.

Similar News