గవర్నర్‌తో జగన్ భేటీ

Update: 2019-05-29 14:15 GMT

ఏపీకి కాబోయే సీఎం జగన్‌ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌తో భేటీ అయ్యారు. కనకదుర్గమ్మ దర్శనం అనంతరం గవర్నర్ బస చేసిన తాజ్‌గేట్‌వే హోటల్‌కు జగన్ చేరుకున్నారు. రేపటి ప్రమాణస్వీకారంతో పాటు కొత్త కేబినెట్‌ కూర్పుపై గవర్నర్‌తో జగన్ చర్చిస్తున్నట్టు సమాచారం. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. 

Similar News