జగన్‌కి ఓటేసిన వాళ్లు కూడా..

Update: 2019-03-21 11:43 GMT

వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీకి పెట్టుబడిదాడులు ఎవరూ ముందుకురారని సీఎం చంద్రబాబు వ్యా‌ఖ్యానించారు. జగన్‌తో ఉన్న వాళ్లంతా గతంలో జైలుకి వెళ్లారనీ ఆ భయంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి దూరంగా పారిపోతారని అన్నారు. జగన్ అవినీతి కారణంగా గతంలో సివిల్ సర్వీసు అధికారులు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చిందని విజయనగరం జిల్లా సాలూరు ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. వైసీపీ నేతల నేర చరిత్ర కారణంగా వారికి మద్దతిచ్చిన వారు కూడా జైలు కెళ్లే పరిస్థితి రావచ్చని చంద్రబాబు హెచ్చరించారు.

Similar News