చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న ఉద్యోగాలు ఊడుతాయి తప్ప కొత్త ఉద్యోగాలేవీ రావని ఎద్దేవ చేశారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో లక్షా 42వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కమలనాథన్ కమిటీ తెలిపిందని, తాము అధికారంలోకి రాగానే ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఎవరికైనా ఏదైన సమస్య వస్తే 72 గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక స్థానిక పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు జగన్.