నాకోసం జగన్ హిమాలయాలకు కూడా వచ్చారు

Update: 2019-06-17 15:15 GMT

శారదా పీతం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ నియామకం విషయం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముందే తెలుసని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. నాలుగేళ్ల క్రితం తాను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటే జగన్ అంత దూరం తన కోసం వచ్చారన్నారు. అపుడే ఉత్తరాధికారి గురించి జగన్ కు చెప్పినట్టు వెల్లడించారు. అదే విధంగా రాజశ్యామల యాగం సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కిరణ్ కుమార్ శర్మను సత్కరించిన విషయం అందరికీ తెల్సిందే అని స్వామి చెప్పారు.

ఏపీలో, తెలంగాణా లో జగన్, కేసీఆర్ ల విజయం గురించి తమ శారదా పీఠం ముందే చెప్పిందన్నారు. ధర్మం అధర్మం పై విజయం సాధిస్తుందని తాను చెప్పానని వివరించారు. 

Tags:    

Similar News