హైకోర్టు మెట్లెక్కిన డేటా వార్..

Update: 2019-03-03 08:55 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా వార్‌ హైకోర్టు మెట్లెక్కింది. నిన్న రాత్రి నుంచి ఐటి గ్రిడ్‌ కంపెనీలో సైబరాబాద్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై అదే సంస్థలో పనిచేస్తున్న అశోక్‌ అనే మరో ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. తమ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదని హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు.  

Similar News