పసుపు కుంకుమ కార్యక్రమంలో గొడవ పడ్డ తెలుగు తమ్ముళ్లు

Update: 2019-02-03 10:56 GMT

శ్రీకాకుళం జిల్లా పొందూరులో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పసుపు కుంకుమ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు, జెడ్పీటీసీ శ్రీరాములు నాయుడు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదంటూ శ్రీరాములు నాయుడు వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో సభ ప్రాంగనంలో ఉద్రికత్త నెలకొంది. ఎమ్మెల్యే కూన గత కొంతకాలంగా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్, కుర్చీలను ధ్వంసం చేయడంతో ఎమ్మెల్యే కార్యక్రమం నిలిపివేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Full View

Similar News