వెయిటర్లు ఉండరు కానీ కోరుకున్న వంటకాలు చిటికెలో టేబుల్పై ప్రత్యక్షమవుతాయి. ముచ్చటగొలిపే రూపం అబ్బుర పరిచే పనితనం మనుషులు కాని మనుషులు మరమనుషులు అక్కడ ఎంతో క్రమశిక్షణతో సర్వ్ చేస్తున్నాయి. చెన్నైలో రోబో థీమ్ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ కస్టమర్ల తెగ ఆకట్టుకుంటుంది.
ముగిలివక్కంపోరూర్ రోడ్డు వెళ్లగానే స్వాగతం పలుకుతుందీ రోబో రెస్టారెంట్. ఆకలితో వెళ్లే అతిథులకు రోబోలు పసందైన రుచులను వేడివేడిగా వడ్డిస్తున్నాయి రోబోలు. చైనీస్, థాయ్ వెజ్ నాన్వెజ్ రుచులను కొసరి కొసరి వడ్డిస్తున్నాయి. దీంతో రోబో రెస్టారెంట్కు భోజన ప్రియులు క్యూ కడుతున్నారు. కుటుంబ సమేతంగా ఓ వైపు నోరూరించే కాంటినెంటల్ రుచులు మరో వైపు రోబోల వడ్డనలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటక స్థలానికి వచ్చినట్లే ఫీలవుతున్నారు.
మనిషి ఎత్తులో తెలుపు, నీలం రంగుల్లో మెడలో స్కార్ఫ్తో చూడగానే ఇట్టే ఆకర్షిస్తున్నాయి రోబోలు. ఫుడ్ ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోపు రోబో ఆర్డర్ చేతిలో పట్టుకుని మన దగ్గరకు వచ్చి నిలబడుతున్నాయి. పిల్లలైతే రోబోల చుట్టూ తిరుగుతూ వాటితో ఆడుకొంటున్నారు. యువత సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఫుడ్ ఎక్కడైనా తినొచ్చు కానీ రోబోలు సర్వ్ చేస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమంటున్నారు కస్టమర్లు. రోబోల కాన్సెప్ట్ అదిరిపోయిందంటూ కస్టమర్లు ముచ్చట పడిపోతుంటే టేబుల్స్ అన్నీ రిజర్వ్ అయి పోతుండటంతో నిర్వాహకులూ ఆనందంలో మునిగిపోతున్నారు.