జగన్కు ఓటేస్తే మోడీకి వేసినట్లేనన్నారు సీఎం చంద్రబాబు. మోడీ, కేసీఆర్, అసద్, జగన్ అంతా కలిసి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పుల్వామా ఘటనలో నిఘా వైఫల్యం, కేంద్రప్రభుత్వం డొల్లతనం కనబడిందని తెలిపారు. ఎన్నికల ముందు బీజేపీ యుద్ధం చేస్తుందని పవన్కల్యాణ్ చెప్పాడని యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా అభివృద్ధి చేస్తే ఓట్లు వస్తాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆదాయం లేని జోన్ను మోడీ ఏపీకి కేటాయించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. టీడీపీని పదే పదే విమర్శించడం వైసీపీ పని అని చంద్రబాబు మండిపడ్డారు.