ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తా..: జగన్

Update: 2019-04-01 02:39 GMT

ఏపీ ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తాం. భవిష్యత్‌ కోసం ప్రజల ఆశా, ఆకాంక్షలే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపిస్తాయని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా పనిచేస్తాను అని జగన్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా డబ్బులు విచ్ఛలవిడిగా ఖర్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గుదాం అనుకుంటున్నా చంద్రబాబుని పన్నాగాన్ని ఏపీ ప్రజలు తప్పకుండా తిప్పికొడతారని జగన్ మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు.

అసలు హైదరాబాద్‌నూ చంద్రబాబు నిర్మించనే లేదు ఇటు అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్ విమర్శించారు. ఏ పార్టీతోనూ తమకు పొత్తుగానీ, సాన్నిహిత్యంగానీ లేదన్నారు. కానీ ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని తేల్చి చెప్పారు. ఆదివారం ఇండియా టుడే టీవీ ఛానల్‌ కన్సల్టెంట్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు, జాతీయస్థాయి రాజకీయాలపై జగన్ మోహన్ రెడ్డి తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నా. నేనిప్పుడు నా ప్రజలకు ఎంతమేర మంచి చేయాలన్న దాని గురించే ఆలోచిస్తున్నని ప్రస్తుతం కూడా అదే ఆలోచిస్తున్నా అని చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబు నమ్మెపరిస్థితే లేదన్నారు.

Similar News