నా కష్టానికి కూలి అడుగుతున్నా: చంద్రబాబు

Update: 2019-03-17 08:08 GMT

ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు. విజయనగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముందుకొచ్చి టీడీపీకి ఓటేయాలని ప్రతిఒక్కరు ప్రచారం చేయాలని నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. రూ.1, లేదా రూ.2, లేదా రూ.3 పార్టీ కోసం ఇచ్చి ఓటు కూడా వేయండి. టీడీపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. నా కష్టానికి కూలి అడుగుతున్నా అని చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశంకానున్నారు. బూత్‌ కమిటీ, నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. 

Similar News