హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్పు...రిటైర్డ్ జిల్లా జడ్జి కురుబ కిష్టప్ప పేరు పరిశీలన ?

Update: 2019-03-20 07:57 GMT

వైసీపీ, హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ను వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సీఐగా పనిచేస్తున్న మాధవ్ రాజీనామాను ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మాధవ్ బదులుగా మరో అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. మాధవ్ వీఆర్ఎస్ ఆమోదం కానందున రిటైర్డ్ జిల్లా జడ్జి కురుబ కిష్టప్ప పేరు పరిశీలిస్తున్నారు.  

Similar News