నిజామాబాద్ రైతుల నామినేషన్ల విత్ డ్రాపై ఉత్కంఠ...బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన...
నిజామాబాద్ లోక్సభ స్థానంలో నామినేషన్ల ఉపసంహరణపై ఉత్కంఠ నెలకొంది. రేపటితో ఉపసంహరణకు గడువు ముగుస్తుండటంతో నేతల్లో టెన్షన్ ఏర్పడింది. ఇప్పటికే 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో ఏడుగురు పలు పార్టీలకు చెందిన వారు కాగా, మిగిలిన 184 మంది అభ్యర్థులూ రైతులే. అయితే, రైతులను విత్ డ్రా చేయించేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఒకవేళ రైతులు నామినేషన్లు ఉపసంహరించుకోకుంటే పరిస్థితేంటన్న దానిపై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.