అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు..

Update: 2019-05-10 06:45 GMT

భానుని భగభగలు మరో రెండు రోజులు మరింతగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదహారు మంది ఎండ వేడిమికి మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకూ నమోదయిన ఉష్ణోగ్రతల కంటే, ఈ రెండు రోజుల్లో మరింత ఎక్కువగా  ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, ఒకవేళ వెళితే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇక మరో నాలుగు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. 

Similar News