పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే .. అయితే రేపు ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ లో ఇండియా , పాకిస్తాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది . దీనికి భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటు సెక్యూరిటీ సర్వీస్ విభాగాలతోనూ స్టేడియంలో భద్రతపై చర్చించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మ్యాచ్ కోసం 4 లక్షల మంది టికెట్ల బుక్ చేసుకున్నారు ..