కొమరం భీమ్ జిల్లా కాగజ్నగర్ వేంపల్లి టింబర్ డిపో నుండి 16 మంది గిరిజనులను హైకోర్టు విచారణ కోసం గిరిజనులు హైదరాబాద్కు బయలుదేరారు. గిరిజనులను తరలించడానికి అటవీ అదికారులు ఎసీ బస్సును ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు సీజే ముందు విచారణకు హజరుకానున్నారు నాలుగు రోజుల క్రితం పునరావాసం ఏర్పాటు చేయకుండా గోంది గూడం నుండి వేంపల్లి టింబర్ డిపోకు తరలించారు రిజర్వ్ పారేస్ట్ లో నివాసం ఉన్నారని ఖాళీ చెయించారు అటవీ అదికారులు..పునరావాసం కల్పించకుండా అటవీ అదికారులు గిరిజనులను తరలించడం పై పౌర హక్కుల సంఘాలు అదికారుల తీరు పై అగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు..దీనిపై సాయంత్రం గిరిజనులకు పునరావాసం గురించి వివరాలను సేకరించేవకాశం ఉంది.