యూపీలో బీజేపీకి షాక్‌..!

Update: 2019-03-27 09:41 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా యూపీలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. సిట్టింగ్‌ ఎంపీ అన్షుల్‌ వర్మా బుధవారం బీజేపీకి గుడ్ బై చెప్పి యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, మరో సీనియర్‌ నేత ఆజంఖాన్‌ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ గూటకి చేరారు. అయితే హర్దోయ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అన్షుల్‌కు ఈసారి మాత్రం బీజేపీ అధిష్ఠానం టిక్కెట్ కేటాయించలేదు. హర్దోయ్‌ నియోజకవర్గంలో జయప్రకాశ్‌ రావత్‌ని ఎన్నికల బరిలో దింపింది. ఈ సందర్భంగా అన్షుల్‌ వర్మా మీడియాతో మాట్లాడుతూ కొద్దిరోజుల కిందట ఓ దేవాలయ ప్రాంగణంలో మద్యం పంపిణీ చేస్తున్న బీజేపీ నేతల్ని అడ్డుకున్నాను దీంతో అప్పటి నుండి బీజేపీ నన్ను ఒక శత్రువుల భావించి, అప్పటి నుండి నాపై వ్యతిరేకత పెరిగిందని చెప్పుకొచ్చారు. కాగా అప్పటి నుండే అన్షుల్‌ను బీజేపీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Similar News