అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే కాగా ఇదే విషయంపై పాటిదార్ ఉద్యమనేత హార్ధిక్ పటేల్ స్పందించారు. ఓ జాతీయఛానల్తో మాట్లాడుతూ అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలనే కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. నరేంద్రమోడీ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ గెలుపు కోసమే నరేంద్ర మోడీ యత్నిస్తున్నారని అందుకే తన అమ్ములపొదిలోని చివర అస్త్రాన్ని ఈ రకంగా వదిలారని హార్ధిక్ అన్నారు. అగ్రకులాలకు పదిశాతం రిజర్వేషన్ లాలీపాప్ ప్రజలకు అందిస్తే అది చాలా పోరబాటు అవుతుందని అన్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని సర్గిగా అమలుచేయకపోతే ప్రజలు తిరగబడతారని హార్ధిక్ వ్యాఖ్యానించారు. మోడీ ఎన్ని జిమిక్కులు చేసిన ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.