హాజీపూర్ సైకో, సీరియల్ కిల్లర్ శ్రీనివాస్రెడ్డి సిట్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్రెడ్డిని సిట్ అధికారుల బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి నుంచి సిట్ అధికారులు ఎలాంటి సమాచారం సేకరించలేకపోతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటివరకు ఐదు రోజులు విచారించిన అధికారులు కేసులకు సంబంధించి ఏ ఒక్క ఆధారం గుర్తించలేదని సమాచారం. పోలీసులు ఎన్ని విధాల ప్రయత్నించినా నిందితుడు నోరుమెదపడం లేదని తెలుస్తోంది. ఈ రోజుతో కస్టడీ ముగియనున్న నేపధ్యంలో మరో వారం పాటు కస్టడి కోరుతూ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే శ్రీనివాస్ స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారించిన సిట్ ..వీరిచ్చిన సమాచారం ఆధారంగా వేర్వేరు కోణాల్లో విచారించాలని భావిస్తున్నారు.