ఇటివల వెలువడిన ఏపీ సార్వత్రిక ఫలితాలలో వైసీపీ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అసలు ఎవరూ ఊహించనివిధంగా సంచలన విజయం సాధించింది. అసెంబ్లీ, లోక్సభ రెండింటిలోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఫ్యాన్ దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ పార్టీ గెలుపు కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ గెలవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించకున్న గాలి జనార్ధన్ మీడియాతో మాట్లాడారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నని చెప్పారు. చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి గోప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోవాలన్నారు. ఇక మరోసారి కేంద్రలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో రాఘవేంద్రస్వామికి మొక్కులు తీర్చుకున్నానని గాలి జనార్దన్రెడ్డి తెలిపారు.