వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం నిందితుడు నీరవ్మోడీ బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను లండన్ కోర్టు మే 24కు వాయిదా వేసింది. నీరవ్మోడీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం ఇది మూడోసారి. మార్చి 19న నీరవ్ మోదీని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా నీరవ్ దేశం విడిచి పోయే అవకాశం ఉందని, సాక్ష్యాలు తారుమారు చేస్తాడని బెయిల్ ఇవ్వొద్దని భారత్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే తాను దేశం విడిచిపోనని భారత్లో కేసు నమోదు కాకముందు నుంచి తాను ఇక్కడ ఉంటున్నానని అలాంటిది తాను దేశం విడిచిపోతాననే కారణంతో బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ తిరస్కరిస్తూ విచారణను వచ్చే నెల 24కు వాయిదా వేసింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్న ఈడీ నీరవ్మోడీకి చెందిన 13 లగ్జరీ కార్లను వేలం వేయాలని నిర్ణయించింది.